కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో లో విబేధాలు బయటకు వచ్చాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీకి అస్సలు ఏమాత్రం పడటం లేదని చెబుతూ ఉన్నారు. తాజాగా నానిపై బాలశౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని.. సొంత నియోజకవర్గంలో ఎంపీకి తిరిగే హక్కు లేదా అని బాలశౌరి ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కలిసి పేర్ని నాని తిరుగుతున్నారని బాలశౌరి ఆరోపించారు. సుజానా చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్ ను తిట్టినా పేర్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. బందురు నీ అడ్డాకాదు రెచ్చిపోతే చూస్తే ఊరుకునేది లేదని బాలశౌరి వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ఆగడాలకు అదిరింపులు బెదిరింపులకు భయపడేది లేదన్నారు బాలశౌరి. తాటాకు చప్పుళ్లకు, ఊడుత ఊపుళ్లకు భయపడేది లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించిన కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని బాలశౌరీ ప్రశ్నించారు.
మరో వైపు పార్టీ కోసం పనిచేసినా బాలశౌరి ప్రాధాన్యతివ్వడం లేదంటూ.. పేర్నినాని అనుచరుడు అజ్గర్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశాడు. బాలశౌరి పర్యటనను అజ్గర్ వర్గీయులు అడ్డుకున్నారు. బాలశౌరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.