More

    ఇద్దరు తీవ్రవాదులను అంతం చేసిన భారత సైన్యం

    జమ్మూకశ్మీరులో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున షోపియాన్‌ జిల్లా చౌగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపాయి. వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

    ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే దాగిఉన్న ఉగ్రవాదుల భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ కొనసాగుతన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. శుక్రవారం కూడా జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ముమన్‌హాల్ (అర్వానీ) ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు.

    Trending Stories

    Related Stories