ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో విశిష్టతలకు నెలవు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

0
628

విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రభుత్వం తరఫున పౌరసన్మానం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషన్‌.. రాష్ట్రపతిని సత్కరించి మెమొంటో అందజేశారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో విశిష్టతలకు నెలవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని.. గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్నారు. తెలుగు భాష గొప్పదనం దేశం మొత్తానికీ తెలుసని చెప్పారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ముర్ము కొనియాడారు. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర స్థలానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని భాషల్లో తెలుగు శ్రేష్టమైనదని చెప్పారు. కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రనను సర్మించుకున్నారు. మొల్ల, దుర్గాభాయ్‌, సరోజినీ నాయుడు వంటి మహనీయుల గొప్పదనాన్ని కీర్తించారు. మొల్ల రామాయనం పేరుతో మహాకావ్యం రచించారని, దానికి భారతీయ సాహిత్యంలో అగ్రస్థానం దక్కిందని వెల్లడించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రా ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని గౌరవించుకోవడం కోసం ప్రజలందరి తరఫున ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పారు. కష్టాలను ఎదుర్కొంటూ దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన ద్రౌపది ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయమని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.