ఇద్దరు శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో ప్రస్తుతం రోహ్తక్లోని సునారియా జైలులో ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్కు మూడు వారాలపాటు పెరోల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. సిర్సాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ ను రాబోయే మూడు వారాల పాటు విడుదల చేయనున్నట్లు జైలు అధికారి ధృవీకరించారు. డేరా చీఫ్ని గురుగ్రామ్లోని తన ఫామ్హౌస్లో ఉండాల్సిందిగా అధికారులు కోరారు. అతను సిర్సాను సందర్శించడానికి వీలు లేదు అని తెలిపారు.
“గుర్మీత్ రామ్ రహీమ్ కు ఫిబ్రవరి 7 నుండి 20 వరకు పెరోల్ మంజూరు చేయబడింది. అతని కుటుంబ సభ్యులు తప్ప, డేరా చీఫ్ ఎవరినీ కలవడానికి అనుమతించరు. మేము అతన్ని గురుగ్రామ్ పోలీసులకు అప్పగిస్తాము. మేము సాయంత్రంలోగా గుర్మీత్ రామ్ రహీమ్ ను విడుదల చేస్తాము” అని జైలు అధికారి తెలిపారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో డేరా బాబాకు సెలవు మంజూరు చేయడం ఆసక్తికర పరిణామంగా భావిస్తూ ఉన్నారు. పంజాబ్ లో డేరా బాబాకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులున్నారు.
అంతకుముందు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి డేరా బాబాకు అనేకసార్లు అత్యవసర పెరోల్లు ఇవ్వబడ్డాయి.. అయితే ఈసారి చాలా ఎక్కువ కాలం పెరోల్ మంజూరు చేయబడింది. హర్యానా జైలు మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా మాట్లాడుతూ, చట్టం ప్రకారం పెరోల్ పొందడం ప్రతి ఖైదీకి హక్కు అని, అదే డేరా చీఫ్కు వర్తింపజేయబడిందని అన్నారు.