More

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల అప్డేట్స్

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 90,574 మందికి కరోనా టెస్టులను నిర్వహించగా 3,841 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 760 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 45 కేసులు నమోదవ్వగా.. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అదే సమయంలో 3,963 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిసి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 18,93,354కి చేరుకుంది. 18,42,432 మంది కోలుకున్నారు. 12,744 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    తెలంగాణలో గత 24 గంటల్లో 1,05,123 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 869 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది కరోనాతో మృతి చెందగా 1,197 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 6,24,379కి చేరుకుంది. 6,07,658 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Trending Stories

    Related Stories