భారతదేశంలో గత 24 గంటల్లో 91,702 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో 1,34,580 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823కు చేరింది. మరో 3,403 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 3,63,079కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,77,90,073 మంది కోలుకున్నారు. 11,21,671 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 24,60,85,649 మందికి వ్యాక్సిన్లు వేశారు.
10-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 97,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,416 కొత్త కేసులు నమోదు కాగా అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 235 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 12,981 మంది కరోనా నుంచి కోలుకోగా, 67 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 11,763కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,87,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16,77,063 మంది కోలుకున్నారు. ఇంకా 99,057 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,30,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,798 మందికి పాజిటివ్ అని వెల్లడైందని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం జిల్లాలో 165, నల్గొండ జిల్లాలో 151 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 కేసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో 2,524 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు.తెలంగాణలో ఇప్పటిదాకా 5,98,611 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,71,610 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 23,561 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,440కి చేరింది.