భారతదేశంలో గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,706 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,070 మంది కోలుకోగా, 25 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,698 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,31,55,749కి చేరుకుంది. దేశంలో 4,26,13,440 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,24,611 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.04గా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.93,31,57,352 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 2,28,823 మంది టీకా వేయించుకున్నారు.