More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారత దేశంలో కొత్త‌గా 16,156 క‌రోనా కేసుల నిర్ధార‌ణ అయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అదే సమయంలో 733 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,60,989 మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 17,095 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,36,14,434కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,56,386కు చేరింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,04,04,99,873 వ్యాక్సిన్ డోసులు వేశారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 39,545 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. 437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 20,64,854 కేసులు నమోదు కాగా 20,45,713 మంది కోలుకున్నారు. మొత్తం 14,364 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 41,392 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 186 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు నమోదు కాగా, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,829 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,62,714 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,164 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,951కి పెరిగింది.

    Trending Stories

    Related Stories