భారతదేశంలో గత 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 32,988 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 496 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,03,188కి చేరింది. 3,18,21,428 మంది కోలుకోగా.. ఇంకా 3,44,899 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,36,861కి పెరిగింది. భారతదేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అధికంగా ఉన్నాయని కేంద్రం ఇప్పటికే తెలిపింది.
26-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 67,590 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,539 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 243 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలలో 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,140 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,778కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,07,730 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,79,504 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,448 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 357 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 96 కొత్త కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి, నారాయణ్ పేట్ జిల్లాలలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 405 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 3,865కి పెరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 6,56,455 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,46,344 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,246 మంది చికిత్స పొందుతున్నారు.