More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 29,689 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,40,951కు చేరింది. అదే సమయంలో 42,363 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 415 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,21,382కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,21,469 మంది కోలుకున్నారు. 3,98,100 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 44,19,12,395 వ్యాక్సిన్ డోసులు వేశారు.

    తెలంగాణలో గత 24 గంటల్లో 1,14,105 కరోనా పరీక్షలు నిర్వహించగా 638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 66 కొత్త కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 715 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,41,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,28,679 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,325 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,787కి పెరిగింది.

    26-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 57,672 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,627 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 357 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,017 మందికి కరోనా నయం కాగా, 17 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,273కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,56,392 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,21,371 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,748 మందికి చికిత్స జరుగుతోంది.

    Related Stories