దేశంలో కొత్తగా 11,499 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 23,598 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా 255 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,21,881 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,22,70,482గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 5,13,481కు పెరిగింది.
ఏపీలో గత 24 గంటల వ్యవధిలో 18,915 కరోనా పరీక్షలు నిర్వహించగా, 280 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 44 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. అదే సమయంలో 496 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,464 పాజిటివ్ కేసులు నమోదు కాగా 22,98,033 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,709 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,722కి పెరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 35,064 కరోనా పరీక్షలు నిర్వహించగా, 287 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 85 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 569 మంది కరోనా నుంచి కోలుకోగా, మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,383 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,80,462 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,810 మంది చికిత్స పొందుతున్నారు.