More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త‌గా 31,923 క‌రోనా కేసులు నమోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 31,990 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,28,15,731కు చేరింది. కొత్త‌గా 282 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,46,050కు చేరింది. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 187 రోజుల క‌నిష్ఠానికి చేరింది. ప్ర‌స్తుతం 3,01,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 83,39,90,049 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఒక్క కేర‌ళ‌లోనే కొత్తగా 19,675 మందికి వైర‌స్ సోకింది. ఆ రాష్ట్రంలో 142 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,419 కరోనా పరీక్షలు నిర్వహించగా, 258 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు నమోదు కాగా.. వికారాబాద్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 249 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,164 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,55,310 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,946 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,908కి పెరిగింది.

    22-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 56,720 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,365 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 212 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదయింది. అదే సమయంలో 1,466 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,42,073 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,14,180 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,796గా ఉంది. కరోనా మృతుల సంఖ్య 14,097కి పెరిగింది.

    Related Stories