భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,623 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 19,446 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 197 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మొత్తం 3,41,08,996 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 1,78,098 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 3,34,78,247 మంది కోలుకున్నారు. 4,52,651 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో నిన్నటి వరకూ వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 99,12,82,283కు చేరింది. కేరళలో నిన్న 7,643 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 77 మంది మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 46,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 202 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 52 కొత్త కేసులు నమోదు కాగా.. కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,69,365 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,61,484 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,940 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,941కి పెరిగింది.
19-10-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 40,191 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 483 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం, కడప, అనంతపురం జిల్లాలలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 534 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,287 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,41,316 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,654 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,317కి చేరింది.