More

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల అప్డేట్స్

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 62,591 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 631 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. ఇతర జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుతోందని తెలంగాణ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 30 మంది మరణించారు. అదే సమయంలో 5,559 కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. 49,341 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 5,32,784 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,80,458 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. తెలంగాణలో రికవరీ రేటు 90.17 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయి రికవరీ రేటు 84.8 శాతంగా ఉంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 73,749 కరోనా టెస్టులు నిర్వహించగా 18,561 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,152 కొత్త కేసులు నమోదు అయ్యాయి. విశాఖ జిల్లాలో 2,098 కేసులు, అనంతపురం జిల్లాలో 2,094 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 17,334 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో 109 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 14,54,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 12,33,017 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,11,554 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 9,481కి పెరిగింది.

    Trending Stories

    Related Stories