More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త‌ క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గత 24 గంటల్లో 62,224 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 1,07,628 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,33,105 కు చేరింది. మరో 2,542 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,79,573కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,83,88,100 మంది కోలుకున్నారు. 8,65,432 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 26,19,72,014 మందికి వ్యాక్సిన్లు వేశారు.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,20,043 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,556 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 182 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 135, ఖమ్మం జిల్లాలో 133, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 114 కేసులు గుర్తించారు. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 3 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,070 మంది కరోనా నుంచి కోలుకోగా.. 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,510కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,06,436 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 5,82,993 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,933 మందికి చికిత్స జరుగుతోంది.

    15-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 96,153 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 831 కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 830 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 130 కేసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 కరోనా మరణాలు సంభవించగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 12 మంది చనిపోయారు. తాజా మరణాలతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 12,052కి చేరింది. అదే సమయంలో 10,567 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,20,134 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా 17,32,948 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 75,134కి తగ్గింది.

    Trending Stories

    Related Stories