More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భార‌తదేశంలో గత 24 గంటల్లో 38,667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 35,743 మంది కోలుకోగా.. 478 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,30,732కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,38,088 మంది కోలుకున్నారు. 3,87,673 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 87,509 కరోనా పరీక్షలు నిర్వహించగా, 427 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 68 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క తాజా కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 609 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,51,715 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,40,065 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,812 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,838కి పెరిగింది.

    13-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో మొత్తం 73,341 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 1,746 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 304 కేసులు నమోదవ్వగా అత్యల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 20 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 1,648 మంది కరోనా నుంచి కోలుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందారు. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో 19,90,656 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,58,275 మంది కోలుకున్నారు. మొత్తం 13,615 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Related Stories