భారతదేశంలో గత 24గంటల్లో కొత్తగా 27,254 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,32,64,175కి చేరింది. అదే సమయంలో 37,687 మంది కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల సమయంలో కరోనాతో మరో 219 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 4,42,874కి పెరిగింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,24,47,032 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,74,269 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 53,38,945 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 74,38,37,643 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 53,789 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 249 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 313 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,61,551 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,52,398 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,258 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,895కి పెరిగింది.
12-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 45,533 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,190 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 219 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,226 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,29,985 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,00,877 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,110 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,998కి పెరిగింది.