More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త‌గా 21,257 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అంతేకాకుండా యాక్టివ్ కేసులు 205 రోజుల క‌నిష్ఠానికి చేరాయి. దేశంలో నిన్న 271 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,127కి చేరింది. ప్ర‌స్తుతం 2,40,221 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య‌ 3,39,15,569గా ఉంది. దేశంలో నిన్న 50,17,753 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య 93,17,17,191కి చేరింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,857 కరోనా పరీక్షలు నిర్వహించగా, 176 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 53 కొత్త కేసులు నమోదు కాగా, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 216 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,334 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,59,043 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,365 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,926కి పెరిగింది.

    ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. 839 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,55,306కి చేరుకుంది. మొత్తం 20,32,520 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం 8,550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Related Stories