భారతదేశంలో గత 24 గంటల్లో 22,431 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,38,94,312కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 24,602 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,00,258కి చేరింది. గత 24 గంటల్లో 318 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,49,856కు చేరింది. ప్రస్తుతం 2,44,198 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న దేశంలో 43,09,525 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92,63,68,608కి పెరిగింది. కేరళలో నిన్న 12,616 కరోనా కేసులు నమోదయ్యాయి. 134 మంది కరోతో ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 46,558 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 800 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 126 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,178 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 14,228 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,54,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,31,681 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,754 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 39,161 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 187 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 62 కేసులు నమోదు కాగా.. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 170 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,67,158 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,58,827 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,406 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,925కి పెరిగింది.