భారతదేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,27,621కి చేరింది. అదే సమయంలో 43,903 మంది కోలుకోగా.. మరో 219 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,752కి పెరిగింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,81,995 మంది కోలుకున్నారు. 4,04,874 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 68,75,41,762 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ఒక్క కేరళలోనే 26,701 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో 74 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,636 కరోనా పరీక్షలు నిర్వహించగా, 230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 357 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 3,884కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,543 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,50,114 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,545 మంది చికిత్స పొందుతున్నారు.
05-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 65,596 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,623 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 16 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,340 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,21,325 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,92,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,158 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,911కి పెరిగింది.