More

    భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 39,796 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 42,352 మంది కోలుకున్నారు. తాజాగా గణాంకాల ప్రకారం భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,85,229కు చేరింది. గత 24 గంటల్లో 723 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,02,728కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,00,430 మంది కోలుకున్నారు. 4,82,071 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 35,28,92,046 వ్యాక్సిన్ డోసులు వేశారు.

    04-07-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 605 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 107 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 1,088 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 3,691కి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,26,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,11,035 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,964 మందికి చికిత్స అందుతూ ఉంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 94,595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,175 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 662 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,692 మంది కరోనా నుంచి కోలుకోగా.. 29 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 12,844కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,54,754 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,325 మంది చికిత్స పొందుతున్నారు.

    Related Stories