భారతదేశంలో గత 24 గంటల్లో 20,799 కేసులు నమోదయ్యాయయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 180 మంది ప్రాణాలు కోల్పోగా, మరణాల సంఖ్య మొత్తం 4,48,997కి చేరింది. దేశంలో ప్రస్తుతం 2,64,458 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,31,21,247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 90,79,32,861 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,481 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 161 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు గుర్తించారు. అదే సమయంలో 973 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,204కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,52,763 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,28,202 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,357 మంది చికిత్స పొందుతున్నారు.