భారతదేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 15,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 443 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,96,237కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,53,776 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,36,83,581 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,58,880కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,06,85,71,879 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తెలంగాణలో గత 24 గంటల్లో 35,326 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 160 మందికి పాజిటివ్ గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు నమోదు కాగా… నిర్మల్, నారాయణపేట, కామారెడ్డి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 3,974గా ఉంది. అదే సమయంలో 193 మంది కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,958కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,623 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,63,691 మంది ఆరోగ్యవంతులయ్యారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 25,532 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 51 కొత్త కేసులు వెల్లడి కాగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,670 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,48,151 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,142 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,377కి పెరిగింది.