More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త‌గా 29,616 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో క‌రోనా నుంచి 28,046 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 97.78 శాతంగా ఉంది. నిన్న క‌రోనాతో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,46,658కి పెరిగింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 3,01,442 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,28,76,319 మంది కోలుకున్నారు. కేర‌ళ‌లో నిన్న 17,983 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 84,89,29,160 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా 239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు నమోదు కాగా, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 336 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,55,961 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,778 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,911కి పెరిగింది.

    24-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 55,323 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 1,246 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 207 కేసులు నమోదవగా, అత్యల్పంగా అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలలో 13 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 1,450 మంది కరోనా నుంచి కోలుకోగా 10 మంది మహమ్మారి వల్ల మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,44,490కి చేరుకుంది. మొత్తం 20,16,837 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,118 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Trending Stories

    Related Stories