More

    ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతల చౌకబారు మాటలు: సీఎం బసవరాజ్ బొమ్మై

    కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ చౌకబారు మాటలు మాట్లాడుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని అందుకనే.. చౌకబారు మాటలు చెబుతున్నాయని, రాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడరని సీఎం బొమ్మై అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యంత శక్తివంతమైన, అభివృద్ధి ఆధారిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ని నిషేధించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బొమ్మై కృతజ్ఞతలు తెలిపారు.

    “పిఎఫ్‌ఐని నిషేధించాలని, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని అమిత్ షా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశం సురక్షితంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. చట్టాల పటిష్టతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. మోదీ హయాంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. బాంబు పేలుళ్లు, ఉగ్రదాడుల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ ప్రశాంతంగా లేరని బొమ్మై అన్నారు.

    Trending Stories

    Related Stories