More

    కంపెనీలో పని చేస్తున్న 100 మంది ఉద్యోగులకు కార్లు

    చెన్నైకి చెందిన ఒక ఐటి సంస్థ సోమవారం తన ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ను ఇచ్చింది. ఆ ఉద్యోగులు కంపెనీకి ఇచ్చిన నిరంతర మద్దతు, కంపెనీ విజయానికి, వృద్ధికి సహకారం అందించినందుకు 100 మంది ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇచ్చింది. ఐడియాస్2ఐటీ అనే ఐటీ సంస్థ 100 మంది ఉద్యోగులకు మారుతీ సుజుకి కార్లను బహుమతిగా ఇచ్చింది. పదేళ్లకు పైగా మాలో భాగమైన 100 మంది ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇస్తున్నామని. 500 మంది ఉద్యోగుల బలం తమకు ఉందని.. తాము పొందిన సంపదను తిరిగి ఉద్యోగులకు అందించాలన్నదే మా కాన్సెప్ట్‌’’ అని హరి సుబ్రమణియన్, మార్కెటింగ్ హెడ్, ఐడియాస్2ఐటి చెప్పారు.

    ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మురళీ వివేకానందన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ సంస్థ అభివృద్ధికి ఎన్నో ప్రయత్నాలు చేశారని, కంపెనీ వారికి కార్లు బహుమానంగా ఇవ్వడం లేదని, తమ కష్టార్జితంతో సంపాదించుకున్నారని అన్నారు. “ఏడు-ఎనిమిదేళ్ల క్రితం లక్ష్యాలను సాధించినప్పుడు తమ సంపదను పంచుకుంటామని మేము వాగ్దానం చేసాము. ఈ కార్లను ప్రదానం చేయడం మొదటి అడుగు మాత్రమే. సమీప భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను రూపొందించాలని మేము ప్లాన్ చేస్తున్నాము” అని వివేకానందన్ అన్నారు.

    “సంస్థ నుండి బహుమతులు అందుకోవడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. ప్రతి సందర్భంలో కంపెనీ బంగారు నాణేలు, ఐఫోన్‌లు వంటి బహుమతులతో తన ఆనందాన్ని పంచుకుంటుంది, మాకు కారు చాలా పెద్ద విషయం,” బహుమతిని అందుకున్న ఉద్యోగి ప్రశాంత్ అన్నారు. చెన్నైకి చెందిన మరో సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీ (సాస్) కిస్‌ఫ్లో తన ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. ఆ కార్ల విలువ ఒక్కొక్కటి కోటి రూపాయలు.

    Trending Stories

    Related Stories