More

    మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన.. తమ్ముడి మృతిని త‌ట్టుకోలేని అన్న బోరున విల‌పిస్తూ

    మంచిర్యాల జిల్లాలోని ల‌క్సెట్టిపేట‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తమ్ముడి మృతిని త‌ట్టుకోలేని అన్న బోరున విల‌పిస్తూ గుండెపోటుకు గుర‌య్యాడు. ఈ ఉదంతంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. మృతులు లక్సెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్ (47), జగిత్యాల జిల్లాకు చెందిన అతని సోదరుడు శ్రీనివాస్ గౌడ్ (55) అని అధికారులు తెలిపారు. వీరిరువురు వృత్తిరీత్యా వ్యాపారులు. భాస్కర్ గౌడ్ ఉదయం 5 గంటల ప్రాంతంలో జాగింగ్ చేస్తుండగా.. గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అన్నయ్య శ్రీనివాస్ ఉదయం 8 గంటలకు లక్సెట్టిపేటకు చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని ధర్మపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒకే ఇంట్లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు గంట‌ల వ్య‌వ‌ధిలో గుండెపోటుతో మ‌ర‌ణించ‌డం తీవ్ర విషాదాన్ని నింపింది.

    Trending Stories

    Related Stories