More

    పెళ్లి పీటల పైనే వధువు సృజన మృతి.. షాకింగ్ విషయాలు వెల్లడి

    పెళ్లి పీటలపై కూర్చున్న వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలింది. ఏమైందా అని అందరూ అనుకుంటూ ఉన్న సమయంలోనే వధువు చనిపోయిందన్న పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. విశాఖలోని మధురవాడలో గురువారం నాడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ తో సృజన పెళ్లి చేసుకుంటూ ఉండగా.. పెళ్లి కుమార్తె పీటలమీదనే కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు. ఈ క్రమంలో ఆమె శరీరంలో విషపదార్థం ఉన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం సృజన మృతదేహాన్ని కేజిహెచ్ కు పోస్ట్ మార్టం కోసం తరలించారు. సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందనే కథనాలను తెలుగు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా.. సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత దారుణ వార్త వినాల్సి వచ్చింది.

    Trending Stories

    Related Stories