ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా దూసుకుపోతూ ఉంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ విజయం దిశగా పయనిస్తోంది. 2024 జాతీయ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్గా భావించే మెగా ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పంజాబ్ను కైవసం చేసుకుంది. గోవా, ఉత్తరాఖండ్లలో కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. పంజాబ్లో అధికార కాంగ్రెస్కు భారీ ఓటమి ఎదురవుతూ ఉంది.
ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంటరీ స్థానాలు ఉండడంతో భారతదేశంలోని అత్యంత రాజకీయంగా ముఖ్యమైన రాష్ట్రంగా ఉంది. 403 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ మెజారిటీ దిశగా వెళుతూ ఉంది. గతంలో పోలిస్తే బీజేపీకి కాస్త సీట్లు తగ్గుతూ కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ 403 స్థానాలకు గాను ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ను పరిశీలిస్తే బీజేపీ 199 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ 99 చోట్ల, బీఎస్పీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ముందంజలో ఉన్నాయి.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హవా నడుస్తోంది. 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ సర్కారు ఏర్పాటుకు 59 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ 38, శిరోమణి అకాలీదళ్ 18, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. గోవాలో బీజేపీ అధికారం దిశగా ప్రయాణిస్తోంది. మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ 17 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో, ఆప్ ఒక్క స్థానంలో లీడ్ లో ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 స్థానాలకు గాను బీజేపీ 34 చోట్ల, కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యం చూపిస్తున్నాయి. మణిపూర్ రాష్ట్రంలో 60 స్థానాలకు గాను బీజేపీ 23 చోట్ల గెలుపు దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో, ఎన్ పీపీ 13 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. ఇంకొన్ని గంటల్లో పూర్తీ క్లారిటీ రాబోతోంది.