More

    బిపిన్ రావత్ భార్య దుర్మరణం.. వారి కుటుంబాన్ని కలిసిన రాజ్‌నాధ్ సింగ్

    హెలికాఫ్ట‌ర్ ప్రమాదం నేప‌ధ్యంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఢిల్లీలో బిపిన్ రావ‌త్ నివాసానికి చేరుకుని కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. ప్ర‌మాదానికి గురైన హెలికాఫ్ట‌ర్‌లో బిపిన్ రావ‌త్‌తో పాటు ఆయ‌న భార్య మ‌ధులిక రావత్ స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 13కి చేరుకుంది. హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదానికి గురైన ప్రాంతానికి ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌధ‌రి బ‌య‌లుదేరారు.

    (28) ANI on Twitter: “Government likely to issue a statement tomorrow in Parliament on the crash of the military chopper with Chief of Defence Staff on board: Sources” / Twitter

    ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌ బుధ‌వారం సులూర్ నుంచి వెల్లింగ్ట‌న్‌కు వెళుతుండ‌గా కూనూర్ వ‌ద్ద కుప్ప‌కూలింది. హెలికాఫ్ట‌ర్ కూలిన స‌మ‌యంలో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ‌మంచు అలుముకుంది. ప్ర‌మాద ఘ‌ట‌నపై వాయుసేన ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఘ‌ట‌నాస్థ‌లిలో గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో మృత‌దేహాలు ఉన్నాయని తెలుస్తోంది. మృత‌దేహాల‌ను కూనూరు ఎయిర్‌బేస్‌లోని వెల్లింగ్‌ట‌న్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అదే ఆస్ప‌త్రిలో రావ‌త్‌కు ముగ్గురు డాక్ట‌ర్లు చికిత్స అందిస్తున్న‌ట్లు స‌మాచారం.

    (28) ANI on Twitter: “13 of the 14 personnel involved in the military chopper crash in Tamil Nadu have been confirmed dead. Identities of the bodies to be confirmed through DNA testing: Sources” / Twitter

    Trending Stories

    Related Stories