More

    హైదరాబాద్ లో మరో హత్య.. బేగంబజార్ బంద్

    బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం దారుణ హత్య చోటు చేసుకోవడంతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. కొందరు వ్యక్తులు యువకుడిని నడిరోడ్డుపై హత్య చేశారు. బేగంబజార్‌లో ఓ యువకుడిని కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. మచ్చి మార్కెట్ వద్ద దుండగులు యువకుడిని నడిరోడ్డుపై కత్తితో సుమారు 20 సార్లు పొడిచారు.

    బేగంబజార్ కోల్సావాడికి చెందిన 22 సంవత్సరాల నీరజ్ కుమార్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజన (20)ను ఏడాదిన్నర కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంజన కుటుంబీకులు నీరజ్ మీద కక్షపెంచుకున్నారు. సంజన సోదరుడు నీరజ్ ను ఆరునెలలుగా చంపాలని చూస్తున్నాడు. ఇటీవలి కాలంలో సంజన సోదరుడు నీరజ్ ను తన స్నేహితుల సహాయంతో చంపేయాలని సిద్ధమయ్యాడు. శుక్రవారం జనసంచారం తక్కువగా ఉండటంతో రోడ్డు దాటుతుండగా వెనకనుంచి వచ్చి నీరజ్ మీద దాడి చేశారు. అతని తలపై గ్రానైట్ రాయితో మోదారు. ఆ తర్వాత కొబ్బరిబోండాల కత్తితో పొడిచి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతడిని షాహీనాయత్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

    ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించారు. హత్య తరువాత వారు కర్ణాటక గుడిమిత్కల్‌ పారిపోయినట్లు గుర్తించడంతో అక్కడకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తరలించారు. ఈ హత్య చేసింది నీరజ్‌ బావమరుదులు, స్నేహితులేనని పోలీసులు గుర్తించారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నీరజ్ హత్యకు నిరసనగా ఇవాళ బేగం బజార్ బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు.

    Trending Stories

    Related Stories