ఆదోని: ఏపీకి చెందిన యువ క్రీడాకారిణి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి ఎంపికైంది. డిసెంబర్ 9 నుంచి 20వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు జట్టులో స్థానం సంపాదించుకుంది.
టీమిండియాకు అంజలి శర్వాణి ఎంపిక పట్ల ఆదోని ప్రాంతంలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో అంజలి పదో తరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో అంచలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది.