టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాలో తమ ప్రమేయం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ఈ వ్యవహారంలో కేసీఆర్ ప్రమేయం ఉంది కాబట్టే నా సవాల్ను స్వీకరించకుండా పారిపోయాడన్నారు. కేసీఆర్ చేసిన తప్పులు, దోచుకున్న, దాచుకున్న సొమ్ము పాపం ఊరికే పోదన్నారు. త్వరలోనే సీఎం కుటుంబ రాజకీయ జీవిత చరిత్ర సమాధి కాబోతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్కు ముమ్మాటికీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఒకవేళ కేసీఆర్కు ప్రమేయం లేకుంటే లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేసీఆర్తో పాటు ఈ వ్యవహారంలో ఉన్న ఎమ్మెల్యేలు సిద్ధమా? అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులు, కుటుంబ సభ్యులు సైతం లైడిటెక్టివ్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కేసీఆర్కు దమ్ముంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని లేఖ రాయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత పార్టీ రాష్ట్ర ఉఫాధ్యక్షుడు డాక్టర్ మనోహర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, వీరేందర్గౌడ్, యువమోర్చా అధ్యక్షుడు భాను ప్రకాశ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు.