తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రిమాండ్ ను హైకోర్టు రద్దు చేసింది. వెంటనే బండి సంజయ్ ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలులో రిమాండ్లో ఉన్నారు. సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది బీజేపీ లీగల్ సెల్ వెల్లడించింది. సంజయ్ను విడుదల చేయాలని హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బీజేపీ నేతలు తెలిపారు. జుడిషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించి.. వ్యక్తిగత పూచి 40 వేల బాండ్ పై విడుదల చేయాలని జైళ్ల శాఖ ఐజీని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఇవాళ సాయంత్రం బండి సంజయ్ కుమార్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ హై కోర్టు ఆదేశాలతో బీజేపీ నాయకుల్లో ఆనందం నెలకొంది. బండి సంజయ్ విడుదల నేపథ్యంలో భారీ ర్యాలీ చేపట్టేందుకు బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నారు.