బెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. బాబుల్ సుప్రియో ఇటీవలి వరకు కేంద్ర సహాయమంత్రిగా కొనసాగారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. అసన్ సోల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.
బాబుల్ సుప్రియో తన తాజా నిర్ణయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లబోవడంలేదని, టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం, మరే ఇతర పార్టీ కూడా తనను ఆహ్వానించలేదని అన్నారు. తాను కూడా ఏ పార్టీలోనూ చేరట్లేదని తెలిపారు. ఎక్కడైనా గానీ, ఒకరు సామాజిక సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని సుప్రియో చెప్పుకొచ్చారు. ‘అల్విదా’ అంటూ ప్రారంభించి సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో ఉంచి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు బాబుల్ సుప్రియో తెలిపారు. నేను ఒకే టీం ప్లేయర్ను. ఎప్పటికీ ఒకే పార్టీ (బీజేపీ)లో ఉంటా. నా వల్ల కొంతమంది సంతోషపడగా.. మరికొందరు బాధపడ్డారు. సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఒక నిర్ణయం తీసుకున్నానని.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానన్నారు. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం అసాధ్యంగా భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లో చురుకుగా ఉండకుండా సామాజిక సేవ కూడా చేయవచ్చని నేను అర్థం చేసుకున్నాను. నన్ను నేను కొద్దిగా కుదుటపడనివ్వండి. నేను నా పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఇదే విషయమై నేను హోంమంత్రి అమిత్ షా మరియు బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాకు తెలియజేశాను. అయితే, ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని వారు నన్ను మళ్లీ మళ్లీ కోరారు. నన్ను అనేక విధాలుగా ముందుకు నడిపించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
2014 మరియు 2019 మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆ సమయంలో నేను బీజేపీ అభ్యర్థి మాత్రమే.. కానీ నేడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో పార్టీ ప్రధాన ప్రతిపక్షం. నేడు బీజేపీకి రాష్ట్రంలో యువకులు మరియు పెద్దలు ఉన్నారు. వారు పార్టీని రాష్ట్రంలో కొత్త శిఖరాలకు తీసుకువెళతారు. ఇకపై వ్యక్తి-కేంద్రీకృత పార్టీ కాదని నేను కూడా గ్రహించానని ఆయన అన్నారు. నేను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో బ్యాంకర్గా ఉద్యోగం వదిలేసి ముంబైలో సింగర్ అయ్యాను. ఈ రోజు నేను కొత్త ప్రారంభాన్ని కోరుకుంటున్నాను అని తన లెటర్ ను ముగించారు. బాబుల్ సుప్రియో రాజకీయాల్లోకి రాకముందు బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడిగా గుర్తింపు పొందారు.