ప్రకాశం జిల్లాలోని కొండపి మండలం అనకర్లపూడి దగ్గర మూసి వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో ఉన్న 56 మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే.. నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో వరద నీటిలో నుంచి బస్సుని నెట్టుకుని ప్రయాణికులు బయటకు తీసుకువచ్చారు. వరద ప్రవాహం తక్కువ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.