చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు నాటకం నిషేధంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. చింతామణి నాటక ప్రదర్శన తమ మనోభావాలను దెబ్బ తీసేదిగా ఉందంటూ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు 2020లో కోర్టును ఆశ్రయించగా.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ 2022 జనవరిలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పలువురు ఉపాధి కోల్పోయారని, నాటకాన్ని నిషేధించడం వాక్స్వేచ్ఛను హరించడమేనని రఘురామరాజు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.