నిలకడగా ఏపీ గవర్నర్ ఆరోగ్యం..!

0
38

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనారోగ్యం పాలయ్యారు. సోమవారం నాడు ఆయన కడుపు నొప్పితో బాధపడ్డారు. గవర్నర్ అస్వస్థతకు గురయ్యారని రాజ్ భవన్ వర్గాలు డాక్టర్లకు సమాచారం అందించాయి. దీంతో విజయవాడలో డాక్టర్లు రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను పరీక్షించారు. ఆయన ఆసుపత్రిలో చేరితే మంచిదని సలహా ఇచ్చారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోన్నట్టు తెలుస్తోంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్టు గుర్తించి రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న ఆయనకు విజయవంతంగా సర్జరీ చేసినట్టు వైద్యులు జగన్‌కు తెలిపారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.