ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దాదాపు రూ. 2.30 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ వివరాలు:
బడ్జెట్ అంచనా – రూ. 2,29,779.27 కోట్లు
బీసీ సబ్ ప్లాన్ కు – రూ. 28,237 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ కు – రూ. 17,403 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ కు – రూ. 6,131 కోట్లు
ఈబీసీ సంక్షేమానికి – రూ. 5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమానికి – రూ. 359 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్ కు – రూ. 1,756 కోట్లు
మహిళా అభివృద్ధికి – రూ. 47,283.21 కోట్లు
చిన్నారుల కోసం – రూ. 16,748 కోట్లు
విద్యా పథకాలకు – రూ. 24,624 కోట్లు
వ్యవసాయ పథకాలకు – రూ. 11,210 కోట్లు
వైద్యం, ఆరోగ్యానికి – రూ. 13,830 కోట్లు
జగనన్న విద్యాదీవెన – రూ. 2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన – రూ. 2,223.15 కోట్లు
వైయస్ఆర్ రైతు భరోసా – రూ. 3,845 కోట్లు
వైయస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజన – రూ. 1,802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు – రూ. 865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు – రూ. 247 కోట్లు
రైతు కాపు నేస్తం – రూ. 500 కోట్లు
వైయస్సార్ వాహనమిత్ర – రూ. 285 కోట్లు
వైయస్సార్ జగనన్న చేదోడు పథకం – రూ. 300 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితుల చెల్లింపు కోసం – రూ. 200 కోట్లు
వైయస్సార్ మత్స్య భరోసా – రూ. 120 కోట్లు
వైయస్సార్ నేతన్న నేస్తం – రూ. 190 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం – రూ. 50 కోట్లు
ఈబీసీ నేస్తం – రూ. 500 కోట్లు
లా నేస్తం కోసం – రూ. 16.64 కోట్లు
అమ్మఒడి పథకం – రూ. 6,107 కోట్లు
వైయస్సార్ చేయూత – రూ. 4,455 కోట్లు
రైతు పథకాలకు – రూ. 11,210.80 కోట్లు
వైయస్సార్ ఆసరా – రూ. 6,337 కోట్లు
స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమానికి – రూ. 3, 500 కోట్లు
జగనన్న విద్యాకానుక – రూ. 750 కోట్లు
ఉన్నత విద్యకు – రూ. 1,973 కోట్లు
జగనన్న గోరుముద్ద పథకం – 1,200 కోట్లు
వైయస్సార్ పశువుల నష్టపరిహారానికి – రూ. 50 కోట్లు
వ్యవసాయరంగంలో యాంత్రికీకరణకు – రూ. 739.46 కోట్లు
వైయస్సార్ ఉచిత పంటల బీమాకు – రూ. 1,802.82 కోట్లు
వైయస్సార్ టెస్టింగ్ ల్యాబ్ లకు – రూ. 85.57 కోట్లు
ఆరోగ్య రంగానికి – రూ. 13,840.44 కోట్లు
ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి – రూ. 1,535 కోట్లు
ఆరోగ్యశ్రీ, ఔషధాల కొనుగోళ్లకు – రూ. 2,248.94 కోట్లు
ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో శానిటైజేషన్ కు – రూ. 100 కోట్లు
శ్రీకాకుళం జిల్లాలోని పలాస ఆసుపత్రికి – రూ. 50 కోట్లు
కరోనాపై పోరాటానికి – రూ. 1,000 కోట్లు
పరిశ్రమలకు ఇన్సెంటివ్ ల కోసం – రూ. 1,000 కోట్లు
ఏపీఐఐసీకి – రూ. 200 కోట్లు
ఎంఎస్ఎంఈలో మౌలిక వసతులకు – రూ. 60.93 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్ కు – రూ. 250 కోట్లు
ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కు – రూ. 200 కోట్లు
హౌసింగ్, మౌలిక వసతులకు – రూ. 5,661 కోట్లు
అంగన్వాడీల్లో నాడు-నేడు కార్యక్రమాలకు – రూ. 278 కోట్లు
దిశ పథకం – రూ. 33.75 కోట్లు
వైయస్సార్ సంపూర్ణ పోషణ – రూ. 1,556.39 కోట్లు
వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ – రూ. 243.61 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 7,594.6 కోట్లు
ఇమాంలు, మౌజాంలకు – రూ. 80 కోట్లు
అర్చకుల ఇన్సెంటివ్ లకు – రూ. 120 కోట్లు
వైయస్సార్ బీమా – రూ. 372.12 కోట్లు
ల్యాండ్ రీసర్వే కోసం – రూ. 40 కోట్లు
మున్సిపల్, పట్టణ అభివృద్ధిశాఖకు – రూ. 8,727 కోట్లు
నీటిపారుదల శాఖకు – రూ. 13,237.78 కోట్లు
2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా – రూ. 2,29,779.27 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 1,82,196 కోట్లు
మూలధన వ్యయం – రూ. 47,582 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 5 వేల కోట్లు (0.47 శాతం)
ద్రవ్య లోటు – రూ. 37,029.79 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు – రూ. 3.49 శాతం
మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021-22 ఏడాదికి గానూ పలు పథకాల కోసం రూ.31,256.36 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
వ్యవసాయ బడ్జెట్ రూ.68,000 కోట్లు
రైతు భరోసా, పీఎం కిసాన్ కోసం రూ.17,030 కోట్లు
సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.573 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంట బీమా కోసం రూ.1,252 కోట్లు
పంట నష్ట పరిహారం కోసం రూ.1,038 కోట్లు
ధాన్యం కొనుగోళ్లకు రూ.18,343 కోట్లు
ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు రూ.4,761 కోట్లు
ఉచిత విద్యుత్ కోసం రూ.17,430 కోట్లు
విద్యుత్ ఫీడర్ల చానెళ్ల సామర్థ్య పెంపునకు రూ.1,700 కోట్లు
శనగ పంట క్యాష్ సబ్ వెన్షన్ కోసం రూ.300 కోట్లు
సూక్ష్మ సేద్యానికి రూ.1,224 కోట్లు
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను రూపాయిన్నరకే సరఫరా చేయడానికి రూ.1,520 కోట్లు
గత ప్రభుత్వం బకాయిల చెల్లింపుల కోసం రూ.2,771 కోట్లు
వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాల మాఫీ కోసం రూ.688 కోట్లు
విత్తన బకాయిలు రూ.384 కోట్లు
ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.960 కోట్లు
పంటల బీమా బకాయిల కోసం రూ. 716 కోట్లు
రైతుల పరిహారం కోసం రూ.23 కోట్లు