అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు సమీపంలో అక్రమంగా 58 గోవులను కంటైనర్లో తరలిస్తుండగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం నక్కపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంటైనర్లో తెల్లవారుజామున 58 గోవులను వెంపాడు నుండి హైదరాబాద్కు తరలిస్తుండగా తమకు సమాచారం వచ్చిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెప్పారు. దీంతో కంటైనర్ పట్టుకుని పోలీస్స్టేషన్కి అప్పగించమని తెలిపారు. ఈ అక్రమ రవాణాకు కొంతమంది సహకారం అందిస్తున్నారని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గోవు హత్య మహాపాపం అని, గోవుని ఇలా కళేబాలకు తరలించడం కరెక్ట్ కాదన్నారు.