అమర్ నాథ్ యాత్రను మరోసారి నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వర్షాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయని.. వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) అధికారులు ప్రకటించారు. గురువారం అమర్ నాథ్ యాత్రకు పహల్గాం, బల్తాల్ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని, వర్షాలు తగ్గాక అప్పటి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నామని ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) అధికారులు ప్రకటించారు. గురువారం అమర్ నాథ్ యాత్రకు పహల్గాం, బల్తాల్ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని.. వర్షాలు తగ్గాక అప్పటి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. గత నెల 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆ రోజునే పహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లో తొలి యాత్రికుల బృందాలు అమర్నాథ్కు పయనమయ్యాయి. జులై 5న తొలిసారి అధిక వర్షాల కారణంగా యాత్ర నిలిచిపోయింది. అకస్మాత్తుగా వరదలతో 8వ తేదీన మరోసారి యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. ఇప్పటివరకు మొత్తం 1.44 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ లింగాన్ని దర్శించుకున్నట్టు అమర్నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం 16,457 మంది యాత్రికులు అమర్ నాథ్ యాత్రా మార్గంలో ఉండగా.. మరో 5,449 మంది జమ్మూలోని బేస్ క్యాంపు నుంచి బుధవారమే బయలుదేరారు.
జూలై 8న చోటు చేసుకున్న వరదల కారణంగా 16 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గల్లంతయ్యారు. అప్పుడు యాత్రను మూడు రోజుల పాటు నిలిపివేశారు.