ఆదిలాబాద్: జిల్లాలో పత్తి రైతులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతులు పండించిన పత్తి పంటను ఈ నెల 14 నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పత్తి ధర నిర్ణయంలో రైతు సంఘాల నాయకులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇతర మార్కెట్లతో పాటు, ఇంటర్నేషనల్ మార్కెట్లలో పత్తి ధరను బట్టి తాము ధరను నిర్ణయిస్తామని వ్యాపారులు తెలిపారు.