లడఖ్లోని తుర్టుక్ సెక్టార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి వైద్యాన్ని అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 26 మంది సైనికుల బృందం పార్తాపూర్లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్కు వెళుతోంది. ఉదయం 9 గంటలకు, థోయిస్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో, వాహనం రోడ్డుపై నుండి జారిపడి ష్యోక్ నదిలో పడిపోయింది. సుమారు 50-60 అడుగుల లోయలో వాహనం పడిపోవడంతో సైనికులందరికీ గాయాలయ్యాయి. మొత్తం 26 మంది వ్యక్తులను పార్తాపూర్లోని 403 ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. “26 మంది సైనికులతో కూడిన బృందం పార్తాపూర్లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్కు వెళుతోంది. వాహనం రోడ్డుపై నుండి జారి షియోక్ నదిలో పడిపోవడంతో అందులో ఉన్న వారందరికీ గాయాలు అయ్యాయి” అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.